నందమూరి కుటుంబంలో విషాదం.. జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-19 06:45:12  IST  )

నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

నందమూరి కుటుంబంలో విషాదం.. జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే పద్మజ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు స్వయాన సోదరి. నందమూరి పద్మజ మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, నందమూరి అభిమానులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Next Story