HYD: అటువైపు వెళ్తే ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం ఖాయం!

by Disha Web Desk 2 |
HYD: అటువైపు వెళ్తే ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం ఖాయం!
X

దిశ, సిటీ బ్యూరో: హుస్సేన్ సాగర్‌లో గణనాథుల నిమజ్జనం శుక్రవారం కూడా కొనసాగుతుంది. పాతబస్తీ నుంచి వచ్చే గణేష్ మండపాలు రాత్రి రెండు గంటల వరకు చార్మినార్ దాటడంతో నిమజ్జనం ఆలస్యమైనట్టు సమాచారం. అప్పర్ ట్యాంక్ బండ్‌పై గణేష్ మండపాలు నిమజ్జనం కోసం క్యూ కట్టాయి. ఎన్టీఆర్ మార్గంలో మరో గంట నుంచి రెండు గంటల్లో నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్యాంక్ బండ్‌పై గణేష్ మండపాలు క్యూ కట్టడంతో లిబర్టీ, హిమాయత్ నగర్, రాణిగంజ్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. నిమజ్జనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటేషన్ విధుల్లో నిమగ్నమై ఉన్నారు.

Next Story

Most Viewed