- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పటాన్చెరు ఘటనపై టీపీసీసీ సీరియస్
పఠాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్పార్టీలో వర్గ విభేదాలపై పీసీసీ సీరియస్ అయింది. ఇప్పటివరకు అంతర్గత ఉన్న విభేదాలు రోడ్డెక్కడంపై పార్టీ పెద్దలు సీరియస్అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పఠాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్పార్టీలో వర్గ విభేదాలపై పీసీసీ సీరియస్ అయింది. ఇప్పటివరకు అంతర్గత ఉన్న విభేదాలు రోడ్డెక్కడంపై పార్టీ పెద్దలు సీరియస్అయ్యారు. ఈ అంశంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్నియమించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి క్యాంప్ ఆఫీస్పై నియోజవర్గ కాంగ్రెస్ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్వర్గీయుల దాడితో ఇరువర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
ఈ చర్యతో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడంతో పఠాన్చెరు కాంగ్రెస్పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్ఠానం చాలా సీరియస్అయింది. ఈ మేరకు గురువారం టీపీసీసీ ఛీప్మహేశ్కుమార్గౌడ్లేఖ ద్వారా విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్, టీపీసీసీ వైస్ప్రెసిడెంట్ఎంఆర్జీ వినోద్రెడ్డిలను కమిటీ సభ్యులుగా నియమించించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని సూచించారు.






