నా మాటలను మంత్రి కేటీఆర్ వక్రీకరించారు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Dishafeatures2 |
నా మాటలను మంత్రి కేటీఆర్ వక్రీకరించారు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు విద్యుత్ విషయంలో తన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించారని అన్నారు. ఐటీ మంత్రి తన తెలివినంతా ఉపయోగించి చిలువలు పలువలు చేసి ప్రచారం చేయించారని దుయ్యబట్టారు. తాను రైతు బిడ్డనన్న రేవంత్.. కేటీఆర్ లాగా తాను అమెరికాలో జాబ్ చేయలేదని అన్నారు. దమ్ముంటే తనతో పొలంలోకి దిగి నాగలి దున్నాలని మంత్రి కేటీఆర్ కు సవాలు విసిరారు.

విద్యుత్ సమస్యలను నిరసిస్తూ బషీర్ బాగ్ లో నిరసనకు దిగిన రైతులను కాల్చి చంపించింది కేసీఆర్ అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న కేసీఆర్.. రైతులను దగ్గరుండి చంపించారని ఆరోపించారు. అలాంటి వాళ్లు తనపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రైతులకు అసలు ఉచిత విద్యుత్ ను అందించిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ విధానాలను వివరించేందుకే తాను తానా సభలకు వెళ్లానని రేవంత్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed