సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా?

by Disha Web Desk 2 |
సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సచివాలయం ఏమైనా సీఎం కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై శుక్రవారం కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ నుండి సచివాలయానికి వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, కాంగ్రెస్ నేతల అరెస్టుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజానిజాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా? అని ప్రశ్నించారు. అంత రహస్యం వెనుక ఉన్న మర్మం ఏమిటి? అని నిలదీశారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed