టూరిజం కార్పొరేషన్ MD మనోహర్ రావుపై వేటు

by Disha Web Desk 2 |
టూరిజం కార్పొరేషన్ MD మనోహర్ రావుపై వేటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వేళ అధికారుల తీరుపై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు ఐపీఎస్, ఐఏఎస్‌లతో పాటు ముఖ్య అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించిన ఈసీ తాజాగా టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావును సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తిరుమల వెళ్లినందున ఈ చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం ఈసీఐకి సీఈవో వికాస్ రాజు నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా మనోహర్ రావుపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది.


Next Story