‘గుంటూరు కారం’ బ్లాక్ టికెట్ దందాలో టాలీవుడ్ బడా నిర్మాత..?

by Disha Web Desk 4 |
‘గుంటూరు కారం’ బ్లాక్ టికెట్ దందాలో టాలీవుడ్ బడా నిర్మాత..?
X

దిశ, రాచకొండ : మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా టికెట్ బ్లాక్‌లో గురువారం అర్ధరాత్రి ఒంటి గంట షో టికెట్ రూ.5 వేలు పలికింది. రూ.415 టికెట్ బ్లాక్‌లో ఏకంగా రూ.2500- రూ.5 వేల వరకు అమ్మినట్లు తేలింది. ఈ బ్లాక్ టికెట్ దందాపై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసు లకు సమాచారం రావడంతో వారు గచ్చిబౌలి ఏ‌ఎమ్ బీ సినిమా మాల్‌లో సోదాలు చేయగా శివనవీన్ రెడ్డి, శంకర్ రెడ్డిల దగ్గర 236 టికెట్‌లు దొరికాయి. వీరు రూ.10 లక్షలు పెట్టి 636 టికెట్‌లను పేరొందిన నిర్మాత నుంచి కొని వాటిని అత్యధిక ధరకు అమ్ముతునట్లు పోలీసులకు తెలిపారు. టాలీవుడ్‌లో దిల్ ఉన్న నిర్మాతగా పేరొందిన వ్యక్తి ఇలాంటి బ్లాక్ దందా చేస్తున్నాడా అనే విషయం పోలీసులను విస్మయానికి గురిచేసింది. దీంతో ఈ కేసు తదుపరి దర్యాప్తును ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పీఎస్ అధికారులకు అప్పగించారు.

Read More..

‘గుంటూరు కారం’ రివ్యూ.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు మాస్ జాతర..

తేజా సజ్జా ‘హనుమాన్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్ అయినట్టేనా?



Next Story

Most Viewed