ఐటీ అధికారుల పేరిట టోకరా!

by Disha Web Desk 4 |
ఐటీ అధికారుల పేరిట టోకరా!
X

దిశ, వెబ్‌డెస్క్: మోసగాళ్లు కొత్త పంథాలతో వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. తమ తెలివితో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఐటీ అధికారుల పేరుతో మోసగాళ్లు వ్యాపారులకు శఠగోపం పెట్టారు. ఐటీ రిటర్న్స్ లో తప్పులు ఉన్నాయని బెదిరింపులకు కేటుగాళ్లు పాల్పడ్డారు. బెదిరించి వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story