నేడు ఢిల్లీకి గవర్నర్ Tamilisai Soundararajan (తమిళిసై సౌందర్‌రాజన్)

by samatah |   (  Updated:2022-11-22 07:18:26  IST  )

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తమిళిసై ఢిల్లీ పయనం కానున్నారు. అక్కడ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ,

నేడు ఢిల్లీకి గవర్నర్ Tamilisai Soundararajan (తమిళిసై సౌందర్‌రాజన్)
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తమిళిసై ఢిల్లీ పయనం కానున్నారు. అక్కడ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరాజన్ భేటీ కానున్నారు. అయితే, రాష్ట్రంలో వరుసగా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా, ఈ సమయంలో కేంద్ర మంత్రులతో గవర్నర్ తమిళిసై భేటీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే గవర్నర్ తమిళిసై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే.

Next Story