సిద్దిపేటలో తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి

by Disha Web Desk 2 |
సిద్దిపేటలో తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామర్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి దృష్ట్యా చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతిచెందారు. అటుగా వెళ్లిన కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. మృతులు సోహెల్, ఖాసిం, ముస్తఫా‌గా గుర్తించారు. అనంతరం మృతదేహాలు గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed