TSPSC పేపర్ లీకేజీ కేస్.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్

by Disha Web Desk 19 |
TSPSC పేపర్ లీకేజీ కేస్.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ కేసులో సిట్​అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ముప్పయికి చేరింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అనుకున్నంత వేగంగా దర్యాప్తు జరుగుతున్నట్టుగా అనిపించటం లేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి సిట్​అధికారులు దూకుడును పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్​కుమార్‌తో పాటు డాక్యానాయక్, రాజేశ్వర్​నాయక్​తదితరులకు సంబంధించిన బ్యాంక్​అకౌంట్లను మరింత నిశితంగా విశ్లేషిస్తున్నారు.

లభించిన వివరాలు ఆధారంగా నిందితులను అరెస్టు చేస్తూ వస్తున్నారు. తాజాగా ప్రవీణ్​కుమార్​నుంచి ఏఈఈ సివిల్, జనరల్​స్టడీస్​పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కొన్న క్రాంతి, శశిధర్​రెడ్డి, రవితేజలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మూడేసి లక్షల రూపాయలు ఇచ్చి ప్రవీణ్​కుమార్​నుంచి ప్రశ్నాపత్రాలు కొన్నట్టు సమాచారం. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ ​రిమాండుకు తరలించారు.

Next Story

Most Viewed