తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

by Disha Web Desk 2 |
తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బొమ్మకల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు, మనవడి మృతిని తట్టుకోలేక తల్లి బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. బొమ్మకల్‌కు చెందిన శ్రీజ అనే యువతికి కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. భర్త హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా రెండ్రోజుల క్రితం శ్రీజ పుట్టింటికి వచ్చింది.

ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురై ఏడాది వయసున్న కుమారుడికి విషం ఇచ్చి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన శ్రీజ తల్లి జయప్రద సైతం విషయం తాగింది. గమనించిన స్థానికులు జయప్రదను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి, అంతకుముందే శ్రీజ, ఆమె కుమారుడు మృతిచెందారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed