ఎంపీ టు ఎమ్మెల్యే.. ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ముగ్గురు కీలక నేతలు

by Disha Web Desk 19 |
ఎంపీ టు ఎమ్మెల్యే.. ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ముగ్గురు కీలక నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు.రాష్ట్రంలో ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇక నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. దీంతో ఎంపీ పదవులకు వారు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించనున్నది.

సీఎం రేసులోనూ..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజ్ గిరి ఎంపీగా గెలుపొందారు. తాజా ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. హైకమాండ్ ఆదేశిస్తే సీఎం అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగానూ గెలిచారు. ఆ తర్వాత ఉత్తమ్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎంపీగా కొనసాగుతూనే, ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అభ్యర్థి పోటీలోనూ ఉన్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2019లో భువనగిరి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలిచి సీఎం రేసులో ఉన్నారు.

Next Story

Most Viewed