పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు ఇతనే!

by Dishanational2 |
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు ఇతనే!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : పక్కా వ్యూహం ప్రకారం పోలీసులపై పలు దాడులు జరిపిన మావోయిస్టు బసంత్ ఎలియాస్ రవి అనారోగ్యంతో మరణించినట్టు ఆ పార్టీ దక్షిణ సబ్ జోనల్ అధికార ప్రతినిధి సమతా ఒక ప్రకటనలో తెలిపారు. తాడ్మేట్ల, ఊర్పాల్మెట్, తొంగ్ గూడ, భట్టీగూడ దాడుల్లో బసంత్ కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న బసంత్ మావోయిస్టుల మెడికల్ క్యాంపులో తుది శ్వాస విడిచినట్టు తెలిపారు. పార్టీలో 26 ఏళ్ల క్రితం చేరిన బసంత్ సీవైపీసీ, బీఎన్పీసీ బెటాలియాన్లలో సభ్యునిగా పని చేసినట్టు పేర్కొన్నారు. మావోయిస్టుల ఆయుధ తయారీ కార్ఖనా ఇంచార్జిగా కూడా ఉన్న బసంత్ పీఎల్జీఏ దళాలకు పెద్ద ఎత్తున ఆయుధాలు, బాంబులు తయారు చేసి ఇచ్చినట్టు తెలిపారు. బసంత్ చనిపోవడం పార్టీకి పెద్ద లోటు అని పేర్కొన్నారు. అతని స్వస్థలం బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలీ అని తెలిపారు.


Next Story

Most Viewed