కరీంనగర్​ మెడికల్ కాలేజీపై సస్పెన్స్​..!

by Dishafeatures2 |
కరీంనగర్​ మెడికల్ కాలేజీపై సస్పెన్స్​..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ మెడికల్ కాలేజీ పర్మిషన్​పై సస్పెన్స్​ నెలకొన్నది. నేషనల్ మెడికల్ కమిషన్ఇప్పటికీ పర్మిషన్​ ఇవ్వలేదు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్​తో పాటు అన్ని సౌలత్​లు కల్పించినా.. ఇప్పటి వరకు ఎన్ఎంసీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.దీంతో ఆఫీసర్లు కూడా డైలమాలో ఉన్నారు.ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు నేషనల్ మెడికల్ కమిషన్​కు పలుమార్లు రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ కాలేజీ పర్మిషన్​ఇవ్వకపోవడం గమనార్హం. త్వరలో ఇస్తామంటూ ఎన్ఎంసీ దాట వేస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు ఫైర్​అవుతున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల ప్రెజర్​తోనే కరీంనగర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు స్వయంగా వైద్యశాఖలోనే చర్చ జరుగుతున్నది.ఓ వర్గానికి చెందిన వ్యక్తులు పలుకుబడిని ఉపయోగించి కరీంనగర్ లో సర్కారీ వైద్య కళాశాల రాకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

8 కాలేజీలకు ఇచ్చి..?

జిల్లాకో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా 2023–24 అకాడమిక్ ​ఇయర్​లో జనగామ, జయశంకర్​భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం ఆసిఫాబాద్​, రాజన్న సిరిసిల్లా, వికారాబాద్, నిర్మల్​ జిల్లాల్లో ప్రభుత్వం కొత్త మెడికల్​కాలేజీలను నిర్మిస్తుంది. మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్రం మొండి చేయి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్​ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తోన్నది. అయితే అందుకోసం ఎన్​ఎంసీ పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజీలకు అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు, ఇతర సౌలత్​లన్నీ రూల్స్​ ప్రకారం ఉంటే వెంటనే ఎన్​ఎంసీ పర్మిషన్ ఇవ్వాలి. కానీ కరీంనగర్ మెడికల్​ కాలేజీలపై ఇప్పటికీ సస్పెన్స్​వీడలేదు. జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమరం భీం ఆసీఫాబాద్​, సిరిసిల్లా, వికారాబాద్​, నిర్మల్​జిల్లాలకు అనుమతులు వచ్చినా..ఒక్క కరీంనగర్​కే ఎందుకు ? ఆపారో తమకూ అర్థం కావడం లేదని అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆ కాలేజీ కు అన్నీ ఈజీ..

నేషనల్​మెడికల్​ కమిషన్​(ఎన్‌ఎంసీ) రూల్స్​ ప్రకారం కొత్త మెడికల్​ కాలేజీ ప్రారంభించాలంటే కనీసం 480 పడకల ఆసుపత్రి అనుబంధంగా ఉండాలి. ఈ 9 కాలేజీల్లో కరీంనగర్​ లో తప్పా ..మొదట మరేక్కడా ఎన్​ఎంసీ నామ్స్ ప్రకారం ఆసుపత్రుల్లో బెడ్లు లేవు. దీంతో అన్నింటిలో నిబంధనల ప్రకారం బెడ్లను పెంచుతూ వచ్చారు. జనగామ మెడికల్​కాలేజీకు జిల్లా ఆసుపత్రిని అనుసంధానం చేయగా, మథర్​అండ్ చైల్డ్​ కేర్​ యూనిట్​లో ఉన్న 100 పడకలు కలిపితే కేవలం 200 బెడ్లకు మాత్రమే పెరుగుతుంది.అంటే మరో 230 బెడ్లు ఈ మెడికల్​కాలేజీకి అటాచ్​చేశారు. అదే విధంగా జయశంకర్​భూపాలపల్లిలోని జిల్లా ఆసుపత్రిలో పాత, అప్​గ్రేట్ చేస్తున్న బెడ్లతో 390 ఉండగా, మరో 40 బెడ్లు ను ఏర్పాటు చేశారు.కామారెడ్డి లో డీహెచ్​వింగ్​ఆసుపత్రి , ఎంసీహెచ్​ హాస్పిటల్​ కలిపితే 150 బెడ్లు ఉండగా, మరో 280 బెడ్లు ఎటాచ్​చేశారు.

ఖమ్మంలో డిస్ట్రిక్ట్​, ఎంసీహెచ్​ లు కలిపి 400 బెడ్లు ఉండగా, మరో 30 బెడ్లు అదనంగా సమకూర్చారు. ఇక కొమరం భీం ఆసీఫాబాద్​లో 385 బెడ్లతో టీవీవీపీ ఆసుపత్రి ఉండగా, మరో 45 బెడ్లు ,. రాజన్న సిరిసిల్లా జిల్లాలో 400 బెడ్లు ఉండగా మరో 30 బెడ్లు,. వికారాబాద్​లో 150 బెడ్లు ఉండగా, మరో 280 బెడ్లను అదనంగా సమకూర్చుకున్నారు. నిర్మల్​ లోనూ ఇదే తరహాలో బెడ్లను పెంచారు. ఎలాంటి అటాచ్​మెంట్లు లేకుండా కరీంనగర్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే సౌకర్యం ఉన్నా..ఎన్​ఎంసీ ఇప్పటి వరకు పర్మిషన్​ఇవ్వకపోవడం గమనార్హం. రెండు ప్రైవేట్ కాలేజీల ఒత్తిడితోనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

Next Story

Most Viewed