ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ ఈవెంట్‌తో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

by Disha Web Desk 1 |
ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ ఈవెంట్‌తో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాము గత ప్రభుత్వ లోపాలను సరిచేసే పనిలో పడ్డామని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫార్మూలా ఈ-ఫ్రిక్స్ ఈవెంట్ రద్దుపై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలని, ఫార్ములా ఈ-రేసుపై ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే, అలా చేయడం వల్ల ఈవెంట్‌తో రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేకపోగా, ప్రభుత్వమే అదనంగా ఖర్చును భరించాల్సిన పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క స్పష్టం చేశారు.

Next Story

Most Viewed