సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి.. కేంద్ర మంత్రికి వీరముష్టి సంఘం వినతి

by Dishafeatures2 |
సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి.. కేంద్ర మంత్రికి వీరముష్టి సంఘం వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని సంచారజాతుల కులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని వీరభద్రీయ (వీరముష్టి) సంఘం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గురువారం కేంద్ర సోషల్ జస్టిస్, ఎంపవర్మేట్ క్యాబినేట్ మంత్రి వీరేంద్ర కుమార్‌ని తెలంగాణ వీరముష్ఠి సంఘం, కేంద్ర కమిటీ సభ్యులు శ్రీశైలం పుణ్యక్షేత్రం లో కలిసి వినతి పత్రం అందజేశారు. వీరభద్రీయ (వీరాముష్టి) కులాని కేంద్ర డీఎన్‌టీ జాబితాలో చేర్చాలని, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డీ నోటిఫైడ్ నోమాదిక్ ట్రైబస్ బోర్డు కు చైర్మన్‌ను, మేంబర్లను వేంటనే నియమించాలని సంఘం సభ్యులు మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీరబద్రియ (వీరముష్టి) సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి వీరస్వామి, కార్యదర్శి కడెం జంగయ్య, అధికార ప్రతినిధులు కాటెపల్లి ఎల్లేష్, చెవ్వ చిత్తరంజన్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed