సోయం బాపూరావును సస్పెండ్ చేయండి.. గిరిజన సంఘాల డిమాండ్

by Dishafeatures2 |
సోయం బాపూరావును సస్పెండ్ చేయండి.. గిరిజన సంఘాల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి గిరిజన సంఘాలు యత్నించాయి. లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ నుంచి తొలగించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల ముట్టడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోయం బాపూరావును పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా ముట్టడికి యత్నించిన గిరిజన సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed