రైతు కడుపు చల్లగా ఉంటేనే సుభిక్షంగా రాష్ట్రం : గువ్వల బాలరాజు

by Disha Web Desk 4 |
రైతు కడుపు చల్లగా ఉంటేనే సుభిక్షంగా రాష్ట్రం : గువ్వల బాలరాజు
X

దిశ, అచ్చంపేట : రైతు కడుపు చల్లగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వ విప్ బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జిబిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని రైతులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌కి వచ్చిన రైతులు ఆకలితో ఉండకూడదని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ విష్ణుమూర్తి, ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు పర్వతాల ముదిరాజ్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed