జనగణన గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

by Muthe.Rajitha |

జనాభా గణనపై తెలంగాణప్రభుత్వం గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

జనగణన గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనాభా గణనపై తెలంగాణ ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. బుధవారం ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ప్రచురించారు. భారతదేశంలో తదుపరి జనాభా గణన (సెన్సస్) 2027 సంవత్సరంలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ విడుదల చేసిన గెజిట్​ కు కొనసాగింపు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్​ను విడుదల చేసింది.

వచ్చే సంవత్సరం హౌస్​ హోల్డ్​ సర్వే, 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనాభా గణన చేయనున్నారు. ఈ సారి జనాభా గణనతో పాటుగా కులగణన కూడా చేయనున్నారు. జనాభా గణనను పూర్తి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్​ కీలకం కానుంది. 2027 మార్చి 1 నాటికి జనాభా గణన పూర్తి కానుంది.

Next Story