రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ.. అభ్యర్థుల్లో కొత్త టెన్షన్..!

by Disha Web Desk 4 |
రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ.. అభ్యర్థుల్లో కొత్త టెన్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు గురువారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుండగా అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ నెలకొంది. కొన్ని పార్టీల అభ్యర్థులకు ఇంకా బీఫామ్స్ అందలేదు. రేపు చివరి తేదీ కావడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రేపు మధ్యాహ్నం 3 గంటలలోగా ఏ, బీ ఫామ్స్ ఇవ్వకపోతే ఈసీ స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించనుంది. దీంతో ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఏ, బీ ఫాంల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story