- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సింగరేణి కంచెను తొలగించిన ఎమ్మెల్యే.. ఆనందం వ్యక్తం చేసిన రైతులు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్ : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పాములపేట శివారులోని సింగరేణి స్థలంలో అధికారులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రైతులు నడవకుండా దారికి అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను డోజర్తో తొలగించారు. ఇకపై సింగరేణి మేడిపల్లి ఓసీపీ-4 ప్రాజెక్టు భూ నిర్వాసిత రైతులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. కంచె అటువైపు ఉన్న పంట పొలాలు, గోదావరి నదికి వెళ్లే దారి ఉండడంతో కంచెను తొలగించాలని రైతులు కోరినా అధికారులు పట్టంచుకోలేదు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కంచె వద్ద రైతులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మక్కాన్సింగ్ అక్కడికి చేరుకుని డోజర్తో కంచెను తొలగించి దారి ఏర్పాటు చేశారు.
Next Story