- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నూనె తెమ్మన్నందుకు భార్యను చంపిన భర్త
దిశ, వెల్గటూర్ : నూనె కోసం అయిన గొడవ భార్య ప్రాణాలు తీసింది. కత్తిపీటతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభం పల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముత్తునూరు గ్రామానికి చెందిన కండ్లే దేవయ్య ఎల్లమ్మ అనే దంపతులు. వీరు కూతురు రాజేశ్వరిని స్తంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్కి ఇచ్చి 2016లో వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నకానుకలను అల్లుడికి ముట్ట చెప్పారు. కొన్నాళ్ళ పాటు వీరి కాపురం సజావుగానే సాగింది.
అయితే రెండు సంవత్సరాలుగా వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్త జగదీష్ పని పాట లేకుండా జూలయిగా తిరుగుతున్నాడు. తాగుడుకు బానిస అయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికి తోడు భార్య రాజేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు. కూర వండటానికి నూనె పాకెట్ తేవాలని భర్తకు చెప్పింది. నన్ను నూనె తెమ్మంటావా అంటూ భార్యతో జగదీశ్ గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదయి అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం పిల్లలతో పాటు రాజేశ్వరి నిద్రపోయింది. అప్పటికే ఫుల్లుగా తాగేసి ఉన్న జగదీష్ నిద్రపోతున్న భార్యపై ఇంట్లోని కత్తిపీటతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపాడు. మృతదేవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోటేశ్వర్, ఎస్సై నరేష్ తెలిపారు.