తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకం.. ఆ ఇద్దరికి దక్కిన చాన్స్

by Prasad Jukanti |   (  Updated:2026-03-19 13:14:05  IST  )

బడ్జెట్ సమావేశాల వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్‍లు గా ఇద్దరని నియమించింది.

తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకం.. ఆ ఇద్దరికి దక్కిన చాన్స్
X

దిశ, తెలంగణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని అధికార పక్షం ఎమ్మెల్సీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శాసనమండలి విప్‌ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా శాసనమండలిలో ప్రభుత్వ విప్‍లను నియమించింది. ఎమ్మెల్సీలు అద్దరింకి దయాకర్, బల్మూరి వెంకట్‍లను ప్రభుత్వ విప్‍లుగా నియమిస్తూ సీఎస్ కె.రామకృష్ణరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 18వ తేదీ తో వెలువడ్డాయి. వీరి నియామకం కూడా నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.





Next Story