తొలి రోజు ‘‘పది’’ పరీక్ష గందరగోళం.. పేపర్ లీక్ ఘటనతో విద్యార్థులు ఆందోళన!

by Disha Web Desk 19 |
తొలి రోజు ‘‘పది’’ పరీక్ష గందరగోళం.. పేపర్ లీక్ ఘటనతో విద్యార్థులు ఆందోళన!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు తొలిరోజు కాస్త గందరగోళం మధ్య జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠ‌శాల‌-1 లో ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్ అక్కడి వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా సెంటర్ల దగ్గర కూడా అధికారులు అలెర్ట్‌ అయ్యారు.

తెలంగాణ వ్యాప్తంగా 2,652 సెంట‌ర్లను ఏర్పాటు చేశారు. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షలు నిర్వహించారు. ప‌ది ప‌రీక్షల‌కు ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకున్న విద్యార్థుల‌ను గంట ముందే సెంట‌ర్‌లోకి పంపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ సైతం హాల్లోకి అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యూలర్, ప్రైవేట్ కలిపి 484,885 మంది విద్యార్థులు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు హాజరైనారు. రెగ్యూలర్ విభాగంలో విద్యార్థులు 99.60 శాతం మంది, ప్రైవేటుగా 79.01 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

Next Story

Most Viewed