రూపాయికే చికెన్ బిర్యానీ.. ఎక్కడంటే?

by Dishafeatures2 |
రూపాయికే చికెన్ బిర్యానీ.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రూపాయికే చికెన్ బిర్యానీ అంటూ ఓ హోటల్ యాజమాన్యం ప్రకటించింది. కేజీ చికెన్ రూ.300 దాటిన పరిస్థితుల్లో రూపాయికే బిర్యానీ అనడంతో చికెన్ బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. ఈ ఘటన కరీంనగర్ లో జరిగింది. కరీంనగర్ సిటీలోని ద ఎంపైర్ హోటల్ కస్టమర్లను ఆకర్షించేందుకు రూపాయికే చికెన్ బిర్యానీ అంటూ ప్రకటించింది. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే అని తెలిపింది. దీంతో జనం రూపాయి బిర్యానీ కోసం ఎగబడ్డారు. ఇక దాదాపు 800 బిర్యానీ ప్యాకెట్ల వరకు హోటల్ సిబ్బంది కస్టమర్లకు అందించారు.

అయితే జనం అంతకుమించి రావడంతో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున జనం రావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్ రూపాయికే చికెన్ బిర్యానీ అంటూ ఓ హోటల్ యాజమాన్యం ప్రకటించింది.క్కనే బైకులు ఆపిన వారికి 100 నుండి 235 రూపాయల వరకు ఫైన్ వేసిన పోలీసులు. కాగా రూపాయి నోటు ఇచ్చిన వారికే బిర్యానీ అంటూ హోటల్ యాజమాన్యం కండిషన్ పెట్టింది.

Next Story

Most Viewed