ప్రభుత్వ వైద్యశాల‌ను పరిశీలించిన కేంద్ర బృందం..

by Disha Web Desk 4 |
ప్రభుత్వ వైద్యశాల‌ను పరిశీలించిన కేంద్ర బృందం..
X

దిశ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడారు. ప్రభుత్వము రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ పరిశీలనలో వెళ్లడైన ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు తయారుచేసి అందజేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ అబ్దుల్ ఆఫీజ్, డాక్టర్ జ్యోతి సిo లోట్, ప్రాథమిక వైద్యశాల వైద్య అధికారి వేణుగోపాల్, ఆయుష్ వైద్య అధికారినీ సంధ్యారాణి, ఫార్మసిస్ట్ మతిన్, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, తదితరులు ఉన్నారు.


Next Story