Breaking News : 10th పరీక్షల్లో భారీ మార్పులు చేసిన సర్కార్

by Muthe.Rajitha |   (  Updated:2024-11-28 14:54:19  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Breaking News : 10th పరీక్షల్లో భారీ మార్పులు చేసిన సర్కార్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పదవ పరీక్షల్లో(10th Exams) భారీగా మార్పులు చేర్పులు చేపట్టింది. ఇకపై 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో పదవ తరగతి పరీక్షల్లో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించి, మరో 20 మార్కులకు ఇంటర్నల్ విధానాన్ని ప్రవేశ పెట్టగా.. ఇకపై పాఠశాల విద్య - గ్రేడింగ్ విధానానికి బదులుగా మార్కుల విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. 2024-2025 విద్యా సంవత్సరం నుండి SSC పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మూల్యాంకనానికి మార్కులు కేటాయించకుండా 100% మార్కులను పబ్లిక్ పరీక్షలకే కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. పాఠశాల విద్య - గ్రేడింగ్ విధానంలో ఇచ్చే మార్కులు పారదర్శకంగా ఉండటం లేదనే విమర్శలు వచ్చినందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.



Next Story