బ్రేకింగ్.. రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్.. మంత్రి సబితా గుడ్‌న్యూస్

by Disha Web Desk 4 |
బ్రేకింగ్.. రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్.. మంత్రి సబితా గుడ్‌న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండు మూడు రోజుల్లోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ పరీక్షను ఎప్పటిలానే ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా, రానున్న భారీ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో.. ఉపాధ్యాయుల నియామకాలు డీఎస్సీ ద్వారా జరగనున్నాయా? లేక టీఎస్పీఎస్సీ చేపడుతుందా అన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలు కానున్నందున.. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు



Next Story