గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. తీన్మార్ మల్లన్న, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల అరెస్ట్

by Ramesh Naini |

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. తీన్మార్ మల్లన్న, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సాయి ఈశ్వర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్వేసి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు సాయి ఈశ్వర్ తుది శ్వాస విడిచాడు.

ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్‌కి న్యాయం చేయాలంటూ బీసీ సంఘాలు గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీసీ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద చేరుకొని.. ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని.. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నతో పాటు శ్రీనివాస్ గౌడ్‌, తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Next Story