ప్రతాపాన్ని చూపుతున్న భానుడు.. విలవిలలాడుతున్న ప్రజలు

by Disha Web Desk 7 |
ప్రతాపాన్ని చూపుతున్న భానుడు.. విలవిలలాడుతున్న ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలలో ఎండలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. భానుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని మరింత పెంచుతున్నాడు. మొన్నటి వరకు తక్కువ స్థాయి ఎండలకే విలవిలలాడుతున్న ప్రజలపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరింత ప్రభావం చూపుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏప్రిల్ నెలలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అంతే కాకుండా వచ్చే వారం రోజుల పాటు నగరంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని.. తర్వాత ఎండలు క్రమంగా పెరుగుతాయని అంచానా వేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

Next Story

Most Viewed