- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇరాక్ పర్యటనలో తెలంగాణ హోంమంత్రి
by Disha Web Desk 2 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇరాక్ దేశంలోని కర్బాలాలో నవాసా రసూల్ హజ్రత్ ఇమామ్ హుస్సేన్, అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల సమాధుల వద్ద ఫాతిహా పఠించారు. ఈ సందర్భంగా భారతదేశంలో వ్యాపించిన అశాంతి తొలగి ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, ఐకమత్యం నెలకొనాలని, దేశాభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకునేలా అవకాశం ఇవ్వాలని ఆయన ప్రార్థించారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు దీర్ఘాయుష్షు పొందాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజల సౌభాగ్యం కలగాలని ప్రార్థనలు చేశారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించుకునేలా, రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించేలా తమకు అవకాశం ఇవ్వాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులను కలిశారు.
Next Story