గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

by Ajay Maddhiboyina |

గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఈ నెల18న ప్రారంభిస్తామని ప్రకటించింది.

గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఈ నెల18న ప్రారంభిస్తామని ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అమ్రాబాద్‌లోని మాచారంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించింది. పథకం కోసం ఐదేళ్లలో రూ.12,600 కోట్లను కేటాయించబోతున్నట్టు ప్రకటించింది. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా 2 లక్షలకు పైగా గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, విద్యుత్తు, ఉద్యానవన శాఖ అధికారుల పాత్ర కీలకంగా ఉండనుంది.

Next Story