తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మూడు గ్రేటర్ కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-11 03:23:34  IST  )

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను (GHMC) ప్రభుత్వం మూడు విభాగాలుగా విభజించిన విషయం తెలిసిందే.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మూడు గ్రేటర్ కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GHMC)‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ అధికారిక ఉత్తర్వులు ఇవాళ జారీ అయ్యాయి. అందులో జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ మూడు కార్పొరేషన్లకు తాజాగా కమిషనర్లను కూడా నియమించారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్‌వీ కర్ణన్‌ (RV Karnan)ను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన (Srijana), మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి (Vinay Krishna Reddy)ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు.

మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. రాష్ట్రంలో భారీగా IAS అధికారుల బదిలీ

Next Story