బీజేపీకి మత రాజకీయాలే ఎజెండా: డిప్యూటీ సీఎం భట్టి

by GSrikanth |
CLP leader Bhatti Vikramarka
X

దిశ, తెలంగాణ బ్యూరో: హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప, బీజేపీకి మరో ఎజెండా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన పలు సమావేశాల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, దానికి అనుగుణంగానే పోరాడుతామని వివరించారు. దేశంలో కొద్దిమంది తన మిత్రులు మాత్రమే ధనికులుగా, మిగిలిన వాళ్లంతా పేదవారిగా మిగిలిపోవాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని ఆరోపించారు.

బీజేపీ మరోసారి గెలిస్తే రాజ్యాంగం అంతమవుతుందన్నారు. అప్పుడు దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు ఉండవన్నారు. ద్రవ్యోల్బణం, ధరలు పెరగడమే కాకుండా, రిజర్వేషన్లు రద్దు చేస్తారని తెలిపారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతున్నదన్నారు. గత పది ఏళ్లలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చలేదన్నారు. అందుకే ఈసారి ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారని తెలిపారు. మోడీ పెద్ద అబద్దాల కోరని, ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలని, ప్రతి ఒక్కరి అకౌంట్లోరూ.15 లక్షలు జమ చేస్తానని మోసం చేశాడన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నల్ల చట్టాలు తెచ్చి కిసాన్ మరణాలకు కారణమయ్యాడన్నారు.

Next Story

Most Viewed