కొలువులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! నిరుద్యోగ కలలు నేడు నిజమవుతున్నాయి..

by Disha Web Desk 14 |
కొలువులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! నిరుద్యోగ కలలు నేడు నిజమవుతున్నాయి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజాగా ఆయన ఎల్బీ స్టేడియంలో నూతనంగా నియమింపబడిన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కుటుంబానికే కొలువులు ఇచ్చుకునే పాలన పోయి.. తెలంగాణనే కుటుంబంగా భావించి కొలువులు ఇచ్చే ప్రజా పాలన వచ్చింది. ఈ మార్పు అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరుస్తుంది. ఉద్యమకారులకు తృప్తినిస్తుంది. తెలంగాణకు ఆశయాలను సాధిస్తోన్న సంతృప్తినిస్తుంది. నిన్న పోలీసు కొలువులైనా.. నేడు గురుకుల కొలువులైనా.. ఒక నాడు తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు.. నేడు నిజమవుతున్నాయి’ అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed