- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడ్డాను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్రావు
భారతీయ జనడ్డాను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్రావునతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను (JP Nadda) కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో (Kishan Reddy) పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు (N Ramchander Rao) కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను (JP Nadda) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు (N Ramchander Rao) కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపైనా, పార్టీ భవిష్యత్ కార్యాచరణపైనా విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే, తెలంగాణలో బీజేపీ ఆధిపత్యాన్ని పెంచే దిశగా అనుసరించాల్సిన మార్గాలు, వ్యూహాలపై జేపీ నడ్డా స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గత రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయం, ప్రజల సమస్యల పట్ల తన అవగాహనను పంచుకుంటూ, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ చైతన్యం పెంపుపై దృష్టిసారించాలని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంపై ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి నేత, కార్యకర్త లక్ష్యసాధన కోసం సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని నడ్డా పేర్కొన్నారు. నడ్డా సూచించిన వ్యూహాలు తెలంగాణ బీజేపీకి నూతన ఉత్సాహాన్ని నింపనున్నాయని, స్థానిక నాయకత్వం ఆ మార్గంలో ముందుకు సాగేందుకు సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.






