బ్రేకింగ్: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ ​సోమవారం నోటీసులు జారీ చేసింది. బుధవారం వ్యక్తిగతంగా కమిషన్​ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. లిక్కర్​ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ ఇటీవల బండి సంజయ్ ​కుంభకోణాలకు పాల్పడితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్​ వర్గాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టటంతో పాటు ఆయన దిష్టిబొమ్మలను కూడా దహనం చేశాయి.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట కూడా బండి సంజయ్​ దిష్టిబొమ్మను బీఆర్ఎస్​నాయకులు దహనం చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా యాభైకి పైగా పోలీస్​స్టేషన్లలో బండి సంజయ్‌కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, బండి సంజయ్ ​వ్యాఖ్యలను రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. తాజాగా సోమవారం బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేస్తూ బుధవారం వ్యక్తిగతంగా కమిషన్ ​ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు వచ్చినపుడు స్పందిస్తా అని ఇంతకు ముందు బండి సంజయ్ ​అన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉదంతం అన్నివర్గాల్లో ఆసక్తికరంగా మారింది.



Next Story

Most Viewed