సునీల్ కనుగోలుకు కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకుతో ‘కీ’ పోస్ట్

by Disha Web Desk 4 |
సునీల్ కనుగోలుకు కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకుతో ‘కీ’ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన సునీల్ కనుగోలు లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చీఫ్ అడ్వైజర్‌గా నియమించినట్లు అధికారులు తెలిపారు. కేబినెట్ మినిస్టర్ ర్యాంకులో ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీఎంకు సునీల్ కనుగోలు కీలక విషయాల్లో గైడెన్స్ ఇవ్వనున్నారు. పాలనలో కీలక నిర్ణయాల్లో ఆయన ముఖ్య భూమిక పోషించనున్నారు.

అయితే సునీల్ కనుగోలు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని వచ్చిన ఆఫర్ గతేడాది ఏప్రిల్ 26న తిరస్కరించారు. దేశ వ్యాప్తంగా సునీల్ కనుగోలు పలు పార్టీలకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. కర్ణాటకలో హస్తం పార్టీ అధికారంలోకి రావడంలో సునీల్ కీలక పాత్ర పోషించడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


Next Story

Most Viewed