ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా..?

by Disha Web Desk 1 |
ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్ : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధి తిరుమల ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. ఈ నెల 29న చంద్రగ్రహణం ఏర్పడుతండటంతో శ్రీవారి ఆలయాన్ని ఎనమిది గంటల పాటు పూర్తి మూసి ఉంచనున్నారు. అక్టోబర్ 29 తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో ఆలయాన్ని 28న రాత్రి 7 గంటల నుంచి మూసివేయనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. తిరిగి 29 న తెల్లవారుజామున 3.15 కు గర్భగుడిని తరిగి తెరవనున్నట్లు వారు తెలిపారు.



Next Story

Most Viewed