కాంగ్రెస్ మేనిఫెస్టోపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ మేనిఫెస్టోపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీలే మేనిఫెస్టోలో కీలక పాత్ర పోషించనున్నాయన్నారు. డిక్లరేషన్ అనేది మా పార్టీ కమిట్‌మెంట్ అన్నారు. డిక్లరేషన్ సారాంశమంతా కూడా మేనిఫెస్టోలో పెడతామన్నారు. మేనిఫెస్టోపై అన్ని వర్గాల సలహాలు, సూచనలు తీసుకన్నామన్నారు. 3వ తారీఖులోగానే మా మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ప్రధానంగా వినతులు వచ్చాయన్నారు. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలకు సంబంధించి కూడా వినతలు వచ్చాయన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అన్ని వర్గాల సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆచరణ యోగ్యమైన హామీలనే ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు.


Next Story