లోక్ భవన్‌లో శ్రీరామనవమి వేడుకలు.. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రత్యేక పూజలు

by Ramesh Naini |

తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా వారి సతీమణి జానకి శుక్లాతో కలిసి లోక్ భవన్ లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు.

లోక్ భవన్‌లో శ్రీరామనవమి వేడుకలు.. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రత్యేక పూజలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా వారి సతీమణి జానకి శుక్లాతో కలిసి లోక్ భవన్ లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం లోక్ భవన్ కమ్యూనిటీ హాల్ (సంస్కృతి)లో లోక్ భవన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో గవర్నర్ దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి అధికారులకు మరియు సిబ్బందికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంగళ్ హాట్ లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని రథయాత్రను శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు.

Next Story