- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. మరో మూడ్రోజులు భారీ వర్షాలు
జూన్ రెండోవారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 26న మహబూబ్ నగర్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

దిశ, వెబ్డెస్క్: జూన్ రెండోవారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 26న మహబూబ్ నగర్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్తో సహా ఉత్తర తెలంగాణ ప్రాంతాల వరకు చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విస్తరణతో రాష్ట్రంలో మే 28 నుంచి మే 30, 2025 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉత్తర తెలంగాణపై ద్రోణి (trough) ప్రభావం కారణంగా వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మే 29, 2025 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మే 28,29 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
లోతట్టు ప్రాంతాల్లో ముంపు ప్రమాదం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల భద్రత, రైతుల రక్షణ, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు తీరం వెంబడి ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఈ రుతుపవనాలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, సిక్కిం వంటి రాష్ట్రాలకు విస్తరించాయని, రాబోయే వారంరోజుల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 2025 రుతుపవన కాలంలో తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.






