స్మితా సబర్వాల్ ఎమోషనల్ ట్వీట్ వైరల్.. అంత కష్టం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్న నెటిజన్లు!

by Disha Web Desk 1 |
స్మితా సబర్వాల్ ఎమోషనల్ ట్వీట్ వైరల్.. అంత కష్టం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్న నెటిజన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : స్మితా సబర్వాల్, ఐఏఎస్.. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. ట్విట్టర్‌లో ఆమెకు ఉన్న ఫాలోవర్లు ఇంకే అధికారికి లేరనే చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ చాలా కాలం పాటు సీఎంవో కార్యదర్శిగా, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.

దీంతో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి రాగానే గత ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పాతుకుపోయిన ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా.. స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ చర్చకు దారి తీస్తోంది. ‘మనం అగ్నిలో ఎలా నడుస్తామనే విషయం చాలా ముఖ్యమైనది.. తలపైకి ఎత్తి బలంగా నడవాలి’ అంటూ ఎమోషన్ ట్వీట్ చేశారు.

దీంతో సోషల్ మీడియో ఆమె ఫ్యాన్స్ ఆ పోస్ట్ చూసి మెడమ్‌‌కు ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘మీరొక సమర్థవంతమైన అధికారి, మీకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘మీరు చెప్పింది నిజమే.. సవాలక్ష పరిస్థితుల్లో వచ్చే సవాళ్లను సానుకూలంగా, దృఢంగా ఎదుర్కొవాలంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



Next Story

Most Viewed