భద్రాచలం రామాలయంలో వెండి ఇటుక మాయం

by prasad |
భద్రాచలం రామాలయంలో వెండి ఇటుక మాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో:భద్రాచలం రామాలయంలో వెండి ఇటుక మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.భద్రాద్రి రాముడికి భక్తులు సమర్పించిన కానులకపై 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఆడిట్ లో ఈ విషయం బయటపడింది. కనబడకుండా పోయిన వెండి ఇటుక బరువు 6 కిలోలు ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా పూర్తి ఆడిట్ తర్వాత ఈ విషయంలో క్లారిటీ ఇస్తామని ఆమె చెప్పారు. అయితే కనబడకుండా పోయింది కేవలం వెండి ఇటుక మాత్రమేనా లేక ఇంకా తెలియాల్సిన ఆభరణాల లెక్కలు చాలా ఉన్నాయా అనేది భక్తులను ఆందోళన కలిగిస్తోంది.

Next Story

Most Viewed