తెలంగాణ పోలీసు అభ్యర్థులకు బిగ్ అలర్ట్

by Disha Web Desk 2 |
తెలంగాణ పోలీసు అభ్యర్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల మెయిన్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ రేపు విడుదల చేయనున్నారు. 587 పోస్టులకు మార్చిలో పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ పరీక్షల ఫలితాలకు సంబంధించిన ‘కీ’ని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘కీ’ విడుదలైన తర్వాత అభ్యంతరాలుంటే ఈ నెల 14 సాయంత్రం 5 గంటలలోపు తెలపాలని అధికారులు సూచించారు. కాగా, 587 పోస్టులకు తొలుత 2 లక్షల 47 వేల 630 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య పలితాల తర్వాత వీరిలో 59 వేల 574 మంది మిగిలారు. వీరంతా పరీక్షలు రాశారు. సామాజిక వర్గాల వారీగా కటాఫ్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులను కేటాయించనున్నారు. ఈ మేరకు పరీక్షల కీని గురువారం విడుదల చేయనునున్నారు.

Also Read...

ఆత్మహత్యలు చేసుకోకుండా తల్లిదండ్రులు మనోధైర్యం ఇవ్వాలి: సబితా ఇంద్రారెడ్డి

Next Story