చిన్నారిని కాపాడిన వ్యక్తిని సన్మానించిన షిఖా గోయెల్​

by Disha Web Desk 19 |
చిన్నారిని కాపాడిన వ్యక్తిని సన్మానించిన షిఖా గోయెల్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పౌరులు కాస్త ధైర్యంగా వ్యవహరిస్తే పలు నేరాలను అరికట్ట వచ్చని ఉమెన్​సేఫ్టీ వింగ్​అదనపు డీజీపీ షిఖా గోయెల్​అన్నారు. తమ కళ్ల ముందు నేరం జరుగుతున్నా చాలామంది పట్టనట్టుగా ఉండిపోతారని అంటూ ఆపదలో ఉన్నవారిని కాపాడటం కనీస ధర్మంగా పాటించాలని సూచించారు. ఎర్రమంజిల్​రైల్వే స్టేషన్​వద్ద ఓ వ్యక్తి ముక్కుపచ్చలారని చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించగా అడ్డుకుని నిందితుడు అరెస్టు అయ్యేలా చూసిన కళ్యాణ్‌ను తన కార్యాలయంలో మంగళవారం షిఖా గోయెల్​సన్మానించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని కాపాడిన కళ్యాణ్‌కు అభినందనలు తెలియచేశారు.



Next Story

Most Viewed