గొర్రెల స్కామ్ కేసు.. ఏసీబీ నెక్స్ట్ టార్గెట్ తలసాని?

by Disha Web Desk 13 |
గొర్రెల స్కామ్ కేసు..  ఏసీబీ నెక్స్ట్ టార్గెట్ తలసాని?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో మాజీ మంత్రి తలసాని చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఈ కేసులో ఏసీబీ దూకుడు అంతిమంగా ఎలాంటి పరిణామాల వైపు మళ్లబోతున్నది అనేది సంచలనంగా మారుతున్నది. ఈ కేసులో ఏసీబీ అధికారులు గురువారం నలుగురు అధికారులను అరెస్ట్ చేసింది. నిధులు పక్కదారి మళ్లించారనే ఆరోణల నేపథ్యంలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రవి, మేడ్చల్ పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేశ్ లను ఇవాళ అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమాల్లో అధికారులతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేసు దర్యాప్తు అంతిమంగా ఎలాంటి మలుపులకు కేరాఫ్ అడ్రస్ గా మారనున్నది అనేది ఉత్కంఠ రేపుతున్నది.

తాజా అరెస్టులతో కలకలం:

గొర్రెల స్కీమ్ లో జరిగిన స్కామ్ పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఈ కేసులు ఏసీబీకి బదిలీ చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఉన్నతాధికారులు బినామీ ఖాతాలు తెరిచి రూ.2.10 కోట్ల నిధులు మళ్లించారని ఏసీబీ గుర్తించింది. మరో వైపు ఈ పథకంలో అవినీతి నిజమేనని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ పథకంలో ఎంతలా అవినీతి జరిగింతో ఫోటోలతో సహా కాగ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రమంలో ఓ వైపు అధికారుల అరెస్టుల పర్వం తీవ్ర కలకలం రేపుతున్నది. అయితే కేసు పూర్వపరాలు ఎలా ఉన్నా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరిగాయనే ఆరోణలు గుప్పుమంటున్నాయి. దీంతో ప్రస్తుతం నలుగురు అధికారులు అరెస్ట్ కాగా దర్యాప్తులో తలసాని పాత్రపై ఏదైనా షాకింగ్ న్యూస్ బయటకు రాబోతున్నదా? ఈ కేసులో అంతిమంగా మాజీ మంత్రికి ఉచ్చుబిగిసుకోనున్నాదా అనేది గులాబీ పార్టీతో పాటు ఆయన అభిమానుల్లో చర్చగా మారుతున్నది. పశుసంవర్థక శాఖలో ఇప్పటికే ఫైల్స్ మాయం కేసు నడుస్తుండగా తాజాగా గొర్రెల పంపిణీ స్కీమ్ లో అక్రమాల కేసుపై ఏసీబీ దూకుడుతో ఏం జరగబోతున్నదనేది సస్పెన్స్ గా మారింది.

Next Story

Most Viewed