MLC పదవి కోసం బీఆర్ఎస్‌లో ఏడుగురు కీలక నేతలు పోటీ?

by Disha Web Desk 2 |
MLC పదవి కోసం బీఆర్ఎస్‌లో ఏడుగురు కీలక నేతలు పోటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపింది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. 29న ఎన్నికల పోలింగ్‌.. ఫిబ్రవరి 1న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీల్లో పైరవీలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది.

రెండు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్‌లో 15 మంది పోటీ పడుతున్నారు. మరోవైపు అందులో ఒకటి బీఆర్ఎస్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గులాబీ నేతలు కూడా అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్‌లో మొత్తం ఏడుగురు కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో గంప గోవర్దన్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి పైవరీలు ప్రారంభించారు. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఆశీర్వాదం ఎవరికి ఉండనుందో అధికారిక ప్రకటన తర్వాత తెలియనుంది.


Next Story