- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jagityal: హత్యకేసులో ఏడుగురికి జీవిత ఖైదు
by Naga Rani Yarlagadda |
జగిత్యాల జిల్లాలో 2021లో జరిగిన ఓ హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది.

X
దిశ, వెబ్డెస్క్: జగిత్యాల జిల్లాలో 2021లో జరిగిన ఓ హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. 2021 జూన్ 15న ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పడాల రాజిరెడ్డిని (Padala Rajireddy Murder Case) ఏడుగురు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి పూర్తి విచారణ చేపట్టారు.
దర్యాప్తులో నిందితులపై పక్కా ఆధారాలు లభించడంతో, వారిని దోషులుగా నిర్ధారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి శిక్షను ఖరారు చేశారు. ఈ ఏడుగురికి జీవిత ఖైదుతోపాటు ఆరుగురికి రూ.3,500 చొప్పున, మరో వ్యక్తికి రూ.4,000 జరిమానా విధించారు. శిక్ష పొందిన ఏడుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ తీర్పు స్థానికంగా సంచలనంగా మారింది.
Next Story






